దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు భగతసింగ్ పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:06
 Bhagat Singh is a hero who gave his life for the country  Pura Chairman Edma Satyam

కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజా జ్యోతి,..// భగత్ సింగ్ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం యందు భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్ స్వాతంత్ర్య ఉద్యమంలో 23 సంవత్సరాల వయస్సు లో తన ప్రాణాలను లెక్క చేయకుండా దేశం కోసం తన ప్రాణాలర్పించిన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ అన్నారు, నవతరానికి స్ఫూర్తి ప్రదాత భగత్ సింగ్ కు జోహార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాచోటి శ్రీశైలం, కౌన్సిలర్లు సూర్యప్రకాష్ రావు, సైదులు గౌడ్, భోజి రెడ్డి, మనోహర్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, కిషోర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, దుర్గ ప్రసాద్, రవి గౌడ్, నూనె శ్రీనివాస్, రామకృష్ణ, నర్సింహా, శేఖర్ రెడ్డి, మాధవ్ రెడ్డి మరియు యూత్ ఫర్ సేవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు