ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 27సెప్టెంబర్ .///..సూర్యాపేట పట్టణంలోని 39 వ వార్డులో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్ మంగళ వారం వార్డు ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నాటి నుంచి తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందని తెలిపారు. ప్రతి ఏడాదిలాగే బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 339 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు దంతాల సందీప్ నాయుడు, మాజీ కౌన్సిలర్ గాజుల రాంబాయమ్మ , వార్డు ప్రజలు పాల్గొన్నారు.
- 2 views