ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 26సెప్టెంబర్.///..బతుకమ్మ పండుగ ప్రకృతి పండగని 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉందని , అలాంటి పండుగలలో తెలంగాణలో మాత్రమే జరుపుకునే బతుకమ్మ పండుగ ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పుతోందని పేర్కొన్నారు. అనంతరం వార్డు మహిళలతో కోలాటాలు వేస్తూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
- 4 views