అడ్డగూడూర్ సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూరు పట్టణ కేంద్రంలో ఇటీవలే ఏర్పాటుచేసిన అంగడి (సంత) లో కూరగాయలు పెట్టుకొని జీవనం సాగించడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులో ఉన్న అడ్డగూడూరు పట్టణ కేంద్రానికి చెందిన బండి మంజుల అనే నిరుపేద మహిళలకు ఆర్థికంగా బాలెంల సైదులు అండగా నిలిచారు. అడ్డగూడూర్ పట్టణానికి చెందిన బండి మంజుల అనే నిరుపేద మహిళకు రూ.5000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ డబ్బులతో ఆ మహిళా కూరగాయలు తెచ్చుకొని వారం వారం శుక్రవారం నాడు అడ్డగూడూరులో ఏర్పాటు చేసే సంతలో కూరగాయల వ్యాపారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందజేసిన బాలెంల సైదులుకు ఆ మహిళా కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో తుప్పతి బీరప్ప.రాజపేట శోభన్ బాబు. మేకల యాదగిరి.నాగలపల్లి పాండు.తుప్పతి బక్కయ్య. కందుకూరు సాగర్.కందుకూరి నరేష్. గండెల వెంకటేశం. దాసరి వీరన్న.పూజారి నాగరాజు. షఫీ. పెండెల ఉప్పలయ్య. కంచర్ల మహేష్. నరేందర్ చారి.తదితరులు పాల్గొన్నారు
- 1 view