నిరుపేద మహిళకు ఆర్థికంగా అండగా నిలిచిన బాలెంల సైదులు

Submitted by sudhakar on Sat, 17/09/2022 - 11:43
 Balemla Saidus who supported the poor woman financially

 అడ్డగూడూర్ సెప్టెంబర్ 16 ప్రజా జ్యోతి . అడ్డగూడూరు మండలంలో నూతనంగా అంగడి (సంత) ఏర్పాటు చేశారు. దీంతో ఆ యొక్క సంతలో కూరగాయలు పెట్టుకొని జీవనం సాగించడానికి ఆర్థిక స్తోమత లేక దీన స్థితిలో ఉన్న  ఓ ఒంటరి నిరుపేద మహిళలకు ఆర్థికంగా బాలెంల సైదులు అండగా నిలిచారు. మండల కేంద్రానికి చెందిన కురిమిళ్ళ ఏసుమని అనే నిరుపేద మహిళకు రూ.5000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ డబ్బులతో ఆ మహిళా కూరగాయలు తెచ్చుకొని శుక్రవారం అడ్డగూడూరులో ఏర్పాటుచేసిన సంతలో కూరగాయల వ్యాపారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందజేసిన బాలెంల సైదులుకు ఆ మహిళా కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో పూలపల్లి సోమిరెడ్డి పూజారి సైదులు మారిశెట్టి మల్లేష్  బాలెంలమహేందర్ కందుకూరు సాగర్ నాగులపల్లి పాండు సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు