చలో మునుగోడు రెండో విడత యాత్రను విజయవంతం చేద్దాం
బిఎస్పి జనగామ జిల్లా ఇన్చార్జి నీర్మాల రత్నం
జనగామ, సెప్టెంబర్ 20, ప్రజాజ్యోతి:- తెలంగాణా లోబహుజన రాజ్యాధికారం బిఎస్పీ తోనే సాధ్యమని, చలో మునుగోడు రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని బిఎస్పి జనగామ జిల్లా ఇన్చార్జి నీర్మాల రత్నం అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాలులో బహుజన్ సమాజ్ పార్టీ జనగామనియోజకవర్గ ఇన్చార్జ్ జేరుపోతుల కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికిముఖ్య అతిథిగా రత్నం గారు హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 20న చలో మునుగోడు సభ ను విజయవంతం చేయాలని జనగామ జిల్లాలోని జనగామ, నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులకు అభిమానులకు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పిలుపుమేరకుచలో మునుగోడు రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజూరబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు, మునుగోడు ఎన్నికల సందర్భంగా గిరిజన బందు ప్రకటించడం దళితులను గిరిజనులను మోసం చేయడం తప్ప దాని పూర్తిస్థాయిలో అమలుపరిచేది ఏమి లేదన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు నేటి వరకు రాజ్యాధికారంలో వాటలు లేవు.భారత దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూ వస్తున్నాయి గత 75 సంవత్సరాలు నుండి తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం బిఎస్పీ తోనే సాధ్యమవుతుందని ప్రజలకు పిలుపునిచ్చినారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండూరి శ్రీనివాస్, రోడ్డ సుధాకర్, గూడూరి రాజు, సంకటి బాల నర్సయ్య, చేతల అశోక్ తదితరు నాయకులు పాల్గొన్నారు.
- 3 views