నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి
నల్లగొండ సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి)../ జిల్లా ప్రజా పరిషత్ నల్లగొండ కార్యాలయము నందు బండ నరేందర్ రెడ్డి, చైర్ పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ నల్లగొండ అద్యక్షతన పార్ట్ టైమ్ స్వీపర్లతో అవగాహన సమావేశం నిర్వహించడం జరిగినది.ఇట్టి సమావేశములో యన్. ప్రేమ్ కరణ్ రెడ్డి, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్. నల్లగొండ, జి.కాంతమ్మ, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్. నల్లగొండ బిక్షపతి, జిల్లా విద్యాధికారి, నల్లగొండ కె.రాంబాబు, జిల్లా అధ్యక్షులు, పంచాయతీ రాజ్ మినిస్టిరియల్ ఉద్యోగుల సంఘం, వి. సోమేశ్, జిల్లా అధ్యక్షుడు, నాలుగోవ తరగతి ఉద్యోగుల సంఘం, మరియు జి.సురేందర్ రెడ్డి పర్యవేక్షకులు, పరిపాలన పాల్గొన్నారు.