ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

Submitted by Upender Bukka on Sat, 24/09/2022 - 12:59
Awarded to the best teachers

ప్రజా జ్యోతి 23, సెప్టెంబర్..//..నాగారం మండలం నుండి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 17 మంది ఉపాధ్యాయులను ఎంపీపీ కూరం మణి వెంకన్న శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగును నింపడంలో ఉపాధ్యాయుడు సమాజంలో కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఆన్లైన్ విధానమైన సమాజంలొ  గురువు పాత్ర ముఖ్యమైనదని  తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పించిన గురువే సమాజంలో ప్రధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరిచంద్ర ప్రసాద్, ఎం. పి డి ఓ గాలి శోభారాణి, ఎం.ఈ.ఓ బాలు నాయక్, ముత్తయ్య యాదవ్ ,కుంభం కరుణాకర్ ,పల్స వెంకన్న, ప్రభాకర్, మధు, హరి ప్రసాద్, స్వామి తదితరులు పాల్గొన్నారు.