ప్రజా జ్యోతి తిరుమలగిరి టౌన్ సెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి) అన్నదానం మహా దానం అని ఆరాధ్య ఫౌండేషన్ చైర్ పర్సన్, తెలంగాణ ఉద్యమకారులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ అన్నారు. గురువారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ప్రతిష్టించిన పలు గణపతి విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న దాన కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం గణపతి నిమజ్జనం సందర్భంగా పూజకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు కలగకుండా చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం రోజు అధికారులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని కోరారు. అన్నదాన వితరణకు సహాయ సహకారాలు అందించిన దాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- 7 views