దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:49
All the people of the constituency should be blessed with the blessings of Goddess Durga: MLA Sanampudi Saidireddy

 హుజూర్ నగర్ సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి):  హుజూర్ నగర్ పట్టణంలోని  17వ వార్డ్ నందు దేవినవరాత్రుల ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం పాల్గొన్నారు. వార్డులో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ప్రధానకార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, దొంతగాని రమేష్, యువకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.