అలంపూర్, (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 28 : ఐజా మండలం, పులికల్ గ్రామంలో ఐజ మండల ఇన్చార్జి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవ్ రావు బీఎస్పీ పార్టీని బలోపేతం చేసేందుకు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తీరాలంటే మనం బీఎస్పీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ నాయకత్వంలో బహుజనలకి రాజ్యాధికారం వస్తుందని ఆయన అన్నారు. ఐజ పట్టణం నుంచి పులికల్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి చాలా దారుణంగా ఉన్నదని, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి అలాగే ఉందని, కాంట్రాక్టర్ గాని, ప్రజాప్రతినిధులు గాని పటించుకోవడం లేదని తెలిపారు. దీంతో పులికల్ నుంచి ఐజా పట్టణాలకు వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామంలో తిరిగి సమస్యలు తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా ఇదే సమస్యను పెద్ద ఎత్తున చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సదర్భంగా జిల్లా అధ్యక్షులు కేశవరావు స్పందిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే రోడ్డును పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రేమ్ కుమార్, హానుమన్న, చిన్న, దను, మహేందర్, శశి వర్మ, విజయ్, యువరాజు, నవీన్, విక్రమ్, హనుమంత్, ప్రదీప్, సంధ్య వర్మ, చరణ్, మైఖెల్, సుందర్ రాజు, కళ్యాణ్, జయన్న, అశోక్ స్వామిలు తదితరులు పాల్గొన్నారు.
- 1 view