ఆదివాసి గిరిజన సమ్మేళనం గోడ పత్రిక ఆవిష్కరన

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 12:17
Adivasi Tribal Association unveils wall magazine

   భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్14 ప్రజాజ్యోతి  . తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాల కార్యక్రమంలో భాగంగా  శనివారం  నాడు హైదరాబాద్ లో నిర్వహించేఆదివాసి గిరిజన సమ్మేళనం గోడ ప్రతి ,పోస్టర్స్ ను ప్రగతి భవన్ సమావేశ మందిరంలో  కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆవిష్కరించారు.  అనంతరం సమావేశంలో పాల్గొన్న  డి.ఆర్.డి.ఏ., సెర్ప్ సిబ్బంది ఏ.పి.ఎం.లు, సి.సి. వి.ఏ.ఓ. లకు కార్యక్రమం విజయవంతం గా నిర్వహించాలని తెలుపుతూ తగు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, జెడ్పి సీఈఓ శోభారాణి, డిఆర్డీఓ పురుషోత్తం, డి.పి.ఆర్.ఓ.వి.శ్రీధర్, డి.ఈ.ఓ.రాజేందర్, డిపి.ఓ.ఆషాలత, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.