నేరేడుచర్ల, సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి): నేరేడు చేర్ల మున్సిపాల్టీ ప్రధాన చౌరస్తానందు మంగళవారం మండలం పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి పుల్లారావు ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం హాస్పటల్ లో బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు మరియు జాతీయ చేనేత ఐక్యవేదికరాష్ట్రసహాయకార్యదర్శిగానియమించబడిన ఎర్రమధ సావిత్రిని నేరేడుచర్ల మండల ఆర్ఎంపి డాక్టర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన చిలుకూరి ఉపేందర్ ను పద్మశాలి సంఘం తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల గ్రంథాలయ చైర్మన్ జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం మార్కండేయ మండల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఎర్రమద యాదగిరి కోశాధికారి రెబ్బ రమేష్ ప్రచార కార్యదర్శి రావిరాల యుగంధర్ మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహ బాలెన సైదులు మరియు పద్మశాలి సంఘం నాయకులు అక్కల దేవి రవి ఎర్ర మాధ చంద్రమౌళి ఎరమాద శేఖర్ కొంగర శీను నక్క శీను, చిట్టిపోలు ఉపేందర్ అంతయ్య శీను చంద్రం వెంకటకృష్ణ యాదగిరి చిలువేరు శేఖర్ ఏలే శివ రావిరాల నరేష్ తదితరులు పాల్గొన్నారు
- 6 views