మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

Submitted by Ashok Kumar on Sat, 10/09/2022 - 16:35
50 kg of rice will be given to the family of the deceased

దేవరుప్పుల, సెప్టెంబర్ 09, ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్పహాడ్ గ్రామానికి చెందిన జోగు సోమయ్య (85) అనే వ్యక్తి ఇటివల అనారోగ్యంతో మృతిచెందాడు. శనివారం సర్పంచ్ వర్రే మధు వారి నీ నివాసానికి వెళ్లి వారి చిత్ర పటానికి పుల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, 50 కిలోల బియ్యాన్ని అందచేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వర్రే మధు మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన తను ముందుండి ఆదుకుంటానని అన్నారు. కాగా సర్పంచ్ ను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు వర్రే సందీప్, ప్రధాన కార్యదర్శి జోగు వీరస్వామి, జోగు శేఖర్, తెరాస కార్యకర్తలు భిక్షపతి, పరుషరాములు, తదితరులు పాల్గొన్నారు.