టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్లగొండ సెప్టెంబర్ 21(ప్రజాజ్యోతి)../ వీటి కాలనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో కనగాల మండలం ధర్వేశిపురం కురంపల్లి గ్రామాలకు చెందిన పలు కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చెందినముఖ్య నాయకులు 60 కుటుంబాల వారు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.నల్లగొండ నియోజకవర్గ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రతి కుటుంబానికి ఏదో రకమైన సంక్షేమ పథకం అందుతుందని, సమృద్ధిగా నీరు, కరెంటు, లభించి రైతు సంతోషంగా ఉన్నారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డం పడుతుందని రాష్ట్ర అభివృద్ధిని జీర్ణించుకోలేక రకరకాల ఆంక్షలు పెడుతుందని, ఈ విషయాలను అర్థం చేసుకున్న ప్రజలు టిఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న వారిని పాతవారిని, సమన్వయం చేసుకుంటూ అందరూ కలిసి పనిచేసి పార్టీ పురోభివృద్ధికి తోడ్పడాలని ఇందుకు తన సంపూర్ణ సహకారం మీకు అందిస్తానని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన ధర్వేశిపురం నుండి జినుకుంట్ల సైదులు, నగేష్, నరసింహ, గట్టి గుండ్ల సురేష్, చిలకరాజుసైదులు కప్ప పరమేశ, కురంపల్లి బుట్ట నరసింహ పంబాల లింగయ్య పంబాల రాంబాబు పుట్టి లక్ష్మమ్మల ఆధ్వర్యంలో 60 కుటుంబాలకు పైగా, కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కనగల్ ఎంపీపీ కరీం పాషా, జడ్పిటిసి చిట్ల వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ లు, వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు, అయితగొని యాదయ్య, ఎంపీటీసీ నకరగంటి శైలజ సైదులు, అలుగుబెల్లి నర్సిరెడ్డి, బుషిగంపల యాదయ్య,జినుకుంట్ల అంజయ్య, ఆర కంటి నరసింహ, కట్ట స్వామి అయితగోని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.