సహకార సంఘాల సొసైటీలు టిఆర్ఎస్ హయాంలోని బలోపేతం ౼ సింగిల్ విండో అధ్యక్షుడు
గద్వాల ప్రతినిధి (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30 : ప్రాథమిక సహకార సంఘాల సొసైటీలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బలోపేతం అయ్యాయని మల్దకల్ మండల సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం భవనంలో మహాజన సభ నిర్వహించారు. ప్రాథమిక సహకార సంఘాలు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని బలోపేతం చేయడం జరిగిందని, గత ప్రభుత్వాల హయాంలో సొసైటీలు నిర్వీర్యం చేశారని, రైతులు రుణాలు తీసుకొని సొసైటీకి సహకరించాలన్నారు. వడ్లు కొనుగోలు ద్వారా రైతుల నుండి రూ.3 కోట్ల 43 లక్షల రూపాయలు ధాన్యం సేకరించడం జరిగిందన్నారు.