హనుమకొండ, సెప్టెంబర్29 (ప్రజాజ్యోతి) ./..బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గానికి చెందిన దినసరి కూలీ కట్కూరి వేణు అకాల మరణం చెందగా ఆయనకు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గతంలో కార్మిక శాఖ లో కార్మికుడిగా నమోదు చేయించినందున కార్మిక శాఖ నుండి 1,30,000 రూపాయల పరిహారానికి సంబంధించిన చెక్కును ఆయన భార్యకు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అందజేశారు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ భవిష్యత్ లో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు అసంఘటిత కార్మికులకు లేబర్ కార్డులను అందజేశారు. అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులు సంఘటితమై కార్మిక శాఖలో నమోదు చేసుకోవాలని తను గత కొన్నేండ్లుగా అవగాహన కల్పించడమే కాకుండా, తన వ్యక్తిగతంగా 13 వేల మందికి లేబర్ కార్డులు ఇప్పించడమే కాకుండా, 5 వేల మందికి పరిహారాన్ని అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దయచేసి కార్మికులందరూ లేబర్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు, లేబర్ కార్డులు పొందిన కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
- 1 view