ప్రజా జ్యోతి సెప్టెంబర్ 24 చంద్రుగొండ
మండల కేంద్రం ఆయన్న పాలెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన గత కొన్ని నెలలుగా ప్రమాదకరంగా మారిన సైడ్ డ్రైనేజీ. నిత్యం వందలాది మంది పాదచారులు, ద్విచక్ర వాహన దారులు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజీ మరమ్మత్తులకు గురై కొన్ని నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చొరవ తీసుకొని మరమ్మత్తులు నిర్వహించాలని గ్రామస్తులు కోరారు.
చంద్రుగొండ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతటి రామకృష్ణ.
గ్రామానికి ప్రధాన రహదారి డ్రైనేజీ మరమ్మత్తులకు గురై నెలలు గడుస్తున్నాయి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- 8 views