హలియా,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి): సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిడమనూరు మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్టం లో లేని విధంగా దళిత బంధు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ గూటికి చేరుతున్నారని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారికి టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తాటి సత్యపాల్, ఎంపీపీ సలహాదారులు బొల్లం రవి,ఎంపీటీసీ బత్తిని రాధ నరేందర్,వెంకటేశ్వర్లు,మెరుగు రామలింగయ్య,పండ్ల ఉపేందర్,నర్సింగ్ లక్షమయ్య, బాషిపాక నాగయ్య,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
- 9 views