ఎంపీ నామా సిఫార్స్ మేరకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణి
బోనకల్,సెప్టెంబర్21, ప్రజాజ్యోతి: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు,తెరాస లోక్ సభపక్షనేత నామా నాగేశ్వరరావు సిఫార్స్ మేరకు మంజూరైనా చెక్కులను ఎంపి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు.బోనకల్ మండలం పెద్దబీరవల్లి గ్రామానికీ చెందిన పంది వెంకట్రావమ్మ 22000 రూపాయలు,జానకీపురం గ్రామానికీ చెందిన యేన్నెబోయిన నరసింహారావు 26000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతు సమన్వయ కమిటీ జిల్లా అద్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు,మండల తెరాస నాయకులు తన్నీరు రవి, పెద్దబీరవల్లి గ్రామ తెరాస పార్టీ కార్యదర్శి రెడ్డిబోయిన ఉద్దండ్ ఆధ్వర్యంలో అందించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.