పలిమేల ప్రజాజ్యోతి సెప్టెంబర్6.వరద ప్రభావిత పలిమేల మండలంలో జిల్లాకలెక్టర్ భవేశ్ మిశ్రా,అడిషనల్ కలెక్టర్ దివాకర ఆదేశాలమేరకుమంగళవారం నాడు ఫాగింగ్ మిషన్లు ను పలిమేల ఎంపీపీ కురుసం బుచ్చక్క పంపినిచేశారు. మండలంలోని లెంకలగడ్ద,నీలంపల్లి మరియు మొదెడు గ్రామ పంచాయతీలకు ఫాగ్గింగ్ మెషిన్ సరఫరా చేశారు.ఫాగింగ్ మిషన్లు ను దోమలను నివారణకు ఉపయోగించాలని ఆమె తెలిపారు. మలేరియా,టైఫాయిడ్ రహిత మండలంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ బుచ్చక్క తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుచ్చక్క,ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి. ఆయా గ్రామ సర్పంచులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- 2 views