నాంపల్లి, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి ): నాంపల్లి మండలం మహమ్మదాపురం ఎంపిటిసి మల్గి రెడ్డి శ్రీదేవి, మాజీ సర్పంచ్ తుమ్మలూరి దయాకర్ రెడ్డి, నాంపల్లి గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ కర్నాటి మహాత్మా..రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో అదేవిధంగా తుంగపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 10 కుటుంబాల కార్యకర్తలు స్థానిక సర్పంచ్ దండిగ అలివేలు నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో మునుగోడు ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో హైదారాబాద్ తన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.అనంతరం మంత్రి, మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి కార్యకర్తలను ఆహ్వానించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు రైతు బంధు , రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు పథకాలను చూసి ఇతర పార్టీల కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని, రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ హయాంలోని జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి ఏవి రెడ్డి,ఎంపిపి ఏడుదొడ్ల శ్వేత రవిందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కడారి శ్రీశైలం, నాంపల్లి మాజీ సింగిల్ విండో చైర్మన్ నక్క చంద్రశేఖర్, గజ్జేల గెల్వాల్ రెడ్డి, దండిగ ఈదయ్య,నేతళ్ళ నరేష్, దండిగ నరేందర్ యాదవ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
- 2 views