సుమారు 150 మందికి ఉచిత మందుల పంపిణీ.
నర్సింహులపేట సెప్టెంబర్ 24 ప్రజా జ్యోతి //... బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. సుమారు 150 మందికి మందుల పంపిణీ. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీలో బాల వికాస స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 150మందికి టెస్టులు చేసి ఉచిత మందులు అందించడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్ఐ మంగలాల్ మాట్లాడుతూ బాలవికాస సేవలను రసంశించి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రత పాటించి ఆరోగ్యం పట్ల తాగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరువూరుకు చెందిన గరుడ హాస్పటల్ డాక్టర్ టి నారాయణ కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ మంగలాల్, బాలవికాస సెంటర్ మేనేజర్ కందులూరి సుకన్య, గుగ్గిళ్ళ సరూప, చిలకలూరి యాక లక్ష్మి ,గ్రామీణ వైద్యుడు వీరారెడ్డి,ప్రజలు పాల్గొన్నారు.
- 3 views