చౌటుప్పల్ సెప్టెంబర్ 27 ( ప్రజా జ్యోతి).// మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే, ఒక్క ఓటు రెండు లక్షల రూపాయలకు తాకట్టుపెట్టి భారతీయ జనతా పార్టీకి అమ్ముడుపోయారని, మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం జై కేసారం గ్రామంలోని శివాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రచార కార్యక్రమం ప్రారంభించారు, గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన సాల్వాది యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి 10.000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ల కన్నీళ్లు తీర్చే పార్టీ అని పేర్కొన్నారు. బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేసి ఆప్రాజ్యస్వామిక పద్ధతిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు పొట్ట సత్యనారాయణ గౌడ్, భీమిడి ప్రదీప్ జి, ఉప సర్పంచ్ వేముల యమున యాదగిరి, వార్డు సభ్యులు మాదగోని శేఖర్, గంగాదేవి జ్యోతి మల్లేష్, శారదా బిక్షమాచారి, తదితరులు పాల్గొన్నారు.
- 3 views