హలియా,సెప్టెంబర్27(ప్రజా జ్యోతి): కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు భారతదేశానికి స్ఫూర్తిదాయకమని అనుముల ఎంపీపీ సుమతీ పురుషోత్తం అన్నారు.మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారుఅనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తమదైనపాత్ర పోషించినారన్నారు.స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు భారతదేశానికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోళ్ళ లక్ష్మి,సీనియర్ అసిస్టెంట్ సమద్,రాములు టిఆర్ఎస్ పార్టీ,నాయకులు అంజద్ ఖాన్, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- 2 views