దళిత మహిళా సాధికారిత కింద మంజూరైన కార్లు అందజేత
కల్వకుర్తి, అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి): కెసిఆర్ పాలన తెలంగాణ చరిత్రకు స్వర్ణయుగమని స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారుఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దళిత మహిళా సాధికారత కింద మంజూరైన కార్లను లబ్ది దారులకు అందజేశారు..ఈ సందర్బంగాఎమ్మెల్యే మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని ఆయన అన్నారు సీఎం కెసిఆర్ చేపడుతున్న అభివృధి సంక్షేమం పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని దళిత బందు పథకం చరిత అని అన్నారు.అలాగే అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృధి పలాలను అందిస్తున్నారని ఆయన తెలిపారు అనంతరం సింగంపల్లికి చెందిన బాలమనికి , లింగరావు పల్కికి చెందిన యశోద,మంగళ పల్లి కి చెందిన స్వరూన,చరికొండకు చెందిన పరిపూర్ణ లకు మహిళ సాధికారిత ద్వారా మజురైన సబ్సిడీ కార్ల ను ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమలో వైస్ ఎంపీపీ గోవర్ధన్,మండల పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్ కో ఆప్షన్ సభ్యులు కుడుముల మనోహర్ రెడ్డి, ఎంపిటిసి వెంకటయ్య, యువ నాయకులు జమ్ముల శ్రీకాంత్, బాలచందర్, లబ్ధిదారులు కార్యకర్తలు పాల్గొన్నారు
- 3 views