ఇచ్చోడ సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి) ..../ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుకుంటున్న బాలికలు ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించాలని, ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని బోథ్ ఐసిడిఎస్ సిడిపిఓ సౌందర్య తెలిపారు.ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం లోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం లో పోషణ మాసం లో బాగంగా బుధవారం "లోప పోషణ" పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి 1,2,3, కన్సోలేషన్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా బాలికలకు పోషణ మాసం ప్రతిజ్ఞ, హ్యాండ్ వాష్ చేయించడం పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిషోర్ బాలికలకు రక్తహీనత పైన ఎలాంటి అనారోగ్యం కు గురి అవుతారో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఉమరాణి, కే.జి.బి.వి.ప్రత్యేక అధికారిణి మల్లిక, బోధన, బోధనతర సిబ్బంది, కిషోర్ బాలికలు ( విద్యార్థినులు), అంగన్వాడీ టీచర్ లు పాల్గొన్నారు. వ్యాసరచన పోటీ లలో చక్కటి ప్రతిభ చూపిన విద్యార్థినులకు పస్ట్ బహుమతి ఎం.మీరా, సెకండ్ బహుమతి ఎస్. వర్షా, థర్డ్ బహుమతి ఎస్ శీరిష, కన్సులేషన్ బహుమతులు బి. ప్రణవిక కు అందజేశారు.
- 2 views