- సంఘంలో మహిళల పాత్ర కీలకమైనది జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి :- వికారాబాద్ జిల్లా బీసీ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మధులతను తాండూరు నియోజకవర్గం బిసి సంఘం ఆధ్వర్యంలో జాతీయ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. అలాగే యాలాల మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కమ్మరి శేఖర్, ప్రధాన కార్యదర్శి భాస్కర చారి, యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షుడు చెన్నారం లక్ష్మణాచారి, విశ్వకర్మ సంఘం నాయకులు వడ్ల బాలయ్య చారి, (రిటైర్డ్ టీచర్) వడ్ల శ్రీనివాస చారి, విద్యాసాగర్ చారి, ప్రభాకర్ చారి, శ్రీనివాస్ చారిలు బిసి సంగం వికారాబాద్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మధులత, సీనియర్ పాత్రికేయుడు వికారాబాద్ జిల్లా టియుడబ్ల్యూజే( ఐజేయు) అధ్యక్షుడు శ్రీనివాస్ చారి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బిసి సంఘం అభివృద్ధి కోసం మహిళల పాత్ర ఎంతో కీలకమైందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్ కుమార్ చెప్పారు.
బీసీ సంఘం యాలాల మండల అధ్యక్షుడు లక్ష్మణాచారి మాట్లాడుతూ విశ్వకర్మ వర్గానికి చెందిన మధులతకు వికారాబాద్ జిల్లా బీసీ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలుగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. అవకాశం దక్కడం మాకు ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ పలువురు బీసీ సంఘం, విశ్వకర్మ ప్రతినిధులు పాల్గొన్నారు.
- 7 views