నిడమనూరు,సెప్టెంబర్24(ప్రజాజ్యోతి): నిడమనూరు మండలంలోని వేంపాడులో సువర్ణ మల్టీస్పెషల్టి హాస్పిటల్ మిర్యాలగూడ ఆద్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు శనివారం వేంపాడు సర్పంచ్ అర్వ స్వాతి అశోక్ యాదవ్ తెలిపారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేంపాడు గ్రామ ప్రజలకుసువర్ణ మల్టీస్పెషల్టి హాస్పిటల్ డాక్టర్లు ఓ గొప్ప సువర్ణ అవకాశం కల్పించారు .ఆదివారం వేంపాడు గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర సువర్ణ మల్టీస్పెషల్టి హాస్పిటల్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అదేవిధంగా వేంపాడు, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
- 4 views