మునుగోడు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి): మండల పరిధిలో ఉన్న ఊకోండి గ్రామ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా శాఖాధికారి డిఈఓ బిక్షపతి సందర్శించి పాఠశాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కోరారు . మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు సంబంధించిన తరగతి గదులను మరియు ప్రహరీ గోడను పరిశీలించి వీటికి సంబంధించిన మరమత్తులను త్వరగా పూర్తిచేసి పాఠశాల సిబ్బందికి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడింపల్లి. యాదయ్య పంచాయతీ కార్యదర్శి జానకి రాములు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- 8 views