అచ్చంపేట సెప్టెంబర్ 26. ప్రజా జ్యోతి. పోరాట యోధురాలు సాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో విద్యార్థులు నడవాలని బల్మూర్ మండలం కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రం అన్నారుసోమవారం డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతిని అదే విధంగా బతుకమ్మ సంబరాలను విద్యార్థులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరవనితగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ సంబరాలను కూడా జరుపుకోవడం చాలా సంతోషదాయకమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అశోక్ సూపర్డెంట్ నరసింహారావు అశోక్ కుమార్ నరసింహులు స్వామి ముంతాజ్ బేగం రేణుక శ్రీనివాసులు విద్యార్థినిలు స్వప్న శిరీష శివాని శృతి మౌనిక ప్రవళిక రాధిక తదితరులు పాల్గొన్నారు.
- 1 view