డి.ఎస్.పి సంఘీభావ పాదయాత్ర
నాగారం ప్రజా జ్యోతి సెప్టెంబర్ 16. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల రాజ్యాధికారం కొరకై డాక్టర్ శారదన్ మహారాజ్ చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఆరు నెలలు పాటు 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాత్రకు మద్దతుగా శుక్రవారం డి.ఎస్.పి నాగారం మండల కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో జే త్రీ జిల్లా కోఆర్డినేటర్ విజయరామరాజు, మహారాజ్ డిఎస్పీ మండల అధ్యక్షులు భాస్కర్ మహారాజ్, ఉపాధ్యక్షులు నాగార్జున మహారాజ్ మండల కార్యదర్శి నాగరాజు, శ్రీనివాస్ మహారాజ్, కోశాధికారి లక్ష్మణ్ మహారాజు, తిరుపతి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.