తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు విజయవంతం చేయండి.

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 11:05
Make Telangana State National Unity Vajrotsavam a success.

నాగారం సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవాల మహా ర్యాలిని ఉదయం 9 గంటలకు తుంగతుర్తి మైనార్టీ స్కూల్ నుండి  ప్రారంభమై అంబేద్కర్ , తెలంగాణ తల్లి  జ్యోతిరావు పూలే చౌరస్తాల  మీదుగా సీతా రామచంద్రస్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించబడునని  నాగారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, టిఆర్ఎస్వి యువజన నాయకులు, అనుబంధ సంఘాలు,మండల ప్రజలు అత్యధికంగా పాల్గొని  ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు.