నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
నాగారం ప్రజా జ్యోతి 13సెప్టెంబర్ .మామిడిపల్లి గ్రామానికి చెందిన దుస్స నర్సయ్య, పుల్లమ్మ భార్యాభర్తలు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. నరసయ్యకు ముగ్గురు కుమార్తెలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ అద్యక్షులు అంబటి శ్రీనివాస్ మంగళవారం పదివేల రూపాయలను, అరకింట బియ్యంను పార్టీ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....... తల్లిదండ్రులను కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా చితకపోవడం బాధాకరమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.