మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన నాగారం తహసిల్దార్

Submitted by Upender Bukka on Wed, 14/09/2022 - 16:24
Nagaram Tehsildar who provided financial assistance to the deceased's family

ప్రజా జ్యోతి నాగారం 14 సెప్టెంబర్  . నాగారం మండలానికి చెందిన బంగ్లా వీఆర్ఏ ఎల్క సల్మాన్ పెద్ద కుమారుడు ఎల్క సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగారం మండలం తహసిల్దార్ హరిచంద్ర ప్రసాద్ మృతుడి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, సురేష్, అశోక్, సరిత, కల్పన ,శోభన్, పురుషోత్తం, స్వరూప తదితరులు పాల్గొన్నారు.