నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - ఎంఈఓ బాలు నాయక్
హలియా,సెప్టెంబర్25 ప్రజా జ్యోతి: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దసరా సెలవులలో పాఠశాలలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అనుముల మండల విద్యాధికారి బాలు నాయక్ తెలిపారు.సోమవారం 26 నుంచి అక్టోబర్ 09 వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు దినాలు ప్రకటించడమైనది. సెలవు దినాలలో ప్రైవేట్ తరగతులు నిర్వహించరాదన్నారు. నిబంధనల అతిక్రమించి తరగతులు నిర్వహించినట్లయితే చట్టపరంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. దసరా సెలవులలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూన్నారని సమాచారం అందిందన్నారు.