గెలుపే లక్ష్యంగా

Submitted by kareem Md on Tue, 20/09/2022 - 11:49
Aim to win

-జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్
ఫోటో రైటప్:జాతీయ కార్యదర్శి తో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్

హలియా,సెప్టెంబర్18(ప్రజా జ్యోతి);  మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి యువజన కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్ అన్నారు.సోమవారం హైదరాబాదులోని గాంధీభవన్ లో జాతీయ యువజన కాంగ్రెస్ కృష్ణాజి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశాల హజరై మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, రాష్ట్ర,జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.