హలియా,సెప్టెంబర్22(ప్రజా జ్యోతి): మొదటి రెండవ విడుత పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్లను మంజూరు చేయాలని టి ఎస్ ఎస్ జి డి ఎస్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కు వినతి పత్రం సమర్పించారు. గురువారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో గల గొర్రెలు,మేకల అభివృద్ధి కార్యాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ యాదవ్ సంగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,జిల్లా మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి బిక్షపతి యాదవ్,కుంటి గొర్ల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- 1 view