క్రీడలతో మానసిక ప్రశాంతత

Submitted by kareem Md on Fri, 23/09/2022 - 11:45
Peace of mind with sports

-ఏకే పౌండేషన్ చైర్మన్ కట్టే బోయిన అనిల్ కుమార్ యాదవ్
ఫోటో రైటప్ : క్రీడా సామాగ్రిని అందజేస్తున్న అనిల్ కుమార్ యాదవ్.

హలియా,సెప్టెంబర్22(ప్రజా జ్యోతి):  క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని రోజువారి పనిలో ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టే బోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక మానసిక ప్రశాంతతను కలగజేస్తాయని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులు క్రీడల అభివృద్ధి కొరకు ఏకే ఫౌండేషన్ ఎల్లప్పుడు చేయూతనిస్తుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శాగం శ్రవణ్ కుమార్ రెడ్డి,అంజి బాబు, మల్లయ్య యాదవ్, షేక్ రహీం, రామకృష్ణా రెడ్డి, రవిశంకర్, నాగరాజు యాదవ్,చాంద్ పాషా, క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.