సెప్టెంబర్ 26 కార్మిక సంఘాల కలెక్టరేట్ ధర్నా కనీస వేతనాల జీవోలు సవరించాలి
నల్లగొండ సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి)..//.. రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనం రూ 26000/ నిర్ణయించి అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 26న నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొహీనుద్దీన్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లో పిలుపునిచ్చారు.శనివారం సిఐటియు, ఎఐటియూసి, ఐ ఎన్ టియుసి,ఐఎఫ్ టీ యు కార్మిక సంఘాల సంయుక్త సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది.