ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి కుంభం కృష్ణారెడ్డి

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 14:52
One lakh rupees should be waived simultaneously   Kumbham Krishna Reddy

నల్లగొండ సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి).././  రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కుంభం కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మిర్యాలగూడలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలకు నలగొండ పట్టణం నుండి ప్రతినిధులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభలలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కనీసం మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం పట్టణ అధ్యక్షులు పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు దండెంపల్లి యాదయ్య, సహాయ కార్యదర్శి ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి మేకల రవీందర్ రెడ్డి, కళ్లెం బుచ్చిరెడ్డి ,భాస్కర్ రెడ్డి, పరమేష్ ,పాక మల్లయ్య, జాన్ రెడ్డి, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.