పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 05 : కొడకండ్ల మండల కేంద్రంలోని శనైశ్చర ఆలయంలో శనివారం ఘనంగా శని త్రయోదశి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి పిండిపోలు మౌర్య శర్మ మాట్లాడుతూ భక్తులకు కొంగుబంగారమైన శనైశ్చర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా శనైశ్చర స్వామికి నువ్వుల నూనెతో పంచామృతాలతో అభిషేకం చేసి శని గ్రహ మూలమంత్ర హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ దేవాలయంలో శని గ్రహ దోష నివారణ పూజలు, సత్వర వివాహం, సంతానం, ఉద్యోగం,ఆరోగ్యం కలగడానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.