కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపాన్నివెలిగించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Submitted by narmeta srinivas on Mon, 07/11/2022 - 20:06
 కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపాన్నివెలిగించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

విశిష్ట అతిథిగా ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి

జనగామ / పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 07  :  జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం గుట్టపై కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా అఖండ దీపాన్ని సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెలిగించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి హాజరయ్యారు. స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముఖ్య అతిదిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగామంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ,సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో 100 కోట్లతో పాలకుర్తిని అభివ్రుద్ధి చేస్తున్నామని అన్నారు.పాలకుర్తి, వల్మీడీ, బమ్మెరలను ప్రగతి పథంలోకి తెస్తున్నామని అన్నారు.గతంలో పాలకులు ఈ దేవాలయాలను పట్టించుకోలేదని,కేవలం దాతల సాయంతోనే ఈ దేవాలయాలను నడిచేవని అన్నారు.తెలంగాణ వచ్చి, కెసిఆర్ సిఎం అయ్యాకే, తెలంగాణ దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని అన్నారు.పాకులర్తి దేవాలయానికి కూడా సిఎం కెసిఆర్ నిధులిచ్చి అభివ్రుద్ధి చేస్తున్నారని అన్నారు.స్థానిక నాయకులు కూడా ఇందుకు కృషి చేస్తున్నారన్నారు.దక్షిణ భారత దేశంలోనే మూడవ అఖండ జ్యోతిగా పేరు గాంచిన పాలకుర్తి అఖండ దీపోత్సవం అన్నారు.అరుదైన హరిహర క్షేత్రం, అత్యంత మహిమాన్వితైన దేవాలయమని ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఎంతో పవిత్రమైనదని,ఈ అఖండ దీపొత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతం అని అన్నారు.ప్రజలు సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో తులతూగాలని ఆ స్వాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నానని తెలిపారు.కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆడపడుచులు వేల సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఆలయ పూజారులు స్వామి వారి వస్త్రాలు బహూకరించి ఆశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు,గ్రామ పెద్దలు, ఈ.ఓ రజనీ కుమారి, అర్చకులు, ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.