శివనామస్మరణతో మార్మోగిన మహాదేవాలయం
పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 07 : కొడకండ్ల మండల కేంద్రంలోని అతి పురాతనమైన శివాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. మహిమాన్విత మహాదేవాలయం ఉదయం నుండి రాత్రి వరకు శివనామస్మరణతో మార్మోగింది. సోమవారం ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు. భక్తులు మహాదేవునికి పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకాలు, పుష్పార్చన, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాధన వితరణ జరిపారు. మనలోని అజ్ఞానాలను తొలగించడం కోసమే జ్యోతిని వెలిగించుకుంటామని అర్చకుడు పిండిపోలు నాగ దక్షిణామూర్తి తెలిపారు