అఖండ దీపోత్సవ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లిని ఆహ్వానించిన ఆలయ పాలకమండలి

Submitted by narmeta srinivas on Fri, 04/11/2022 - 17:50
అఖండ దీపోత్సవ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లిని ఆహ్వానించిన ఆలయ పాలకమండలి

అఖండ దీపోత్సవ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ

జనగామ /పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 04 :పాలకుర్తి లోని శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తిక మాస ఉత్సవాల సందర్భంగా ఈనెల 7 న నిర్వహిస్తున్న అఖండ దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఆలయ పాలకమండలి,ఆలయ ఈఓ రజని కుమారి శుక్రవారం హనుమకొండ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి ఆహ్వానించారు. అనంతరం అఖండ దీపోత్సవ కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తి దేవాలయం మహిమాన్వితమైనదని ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే అఖండ దీపొత్సవం అద్భుతంగా జరుగుతుందని. ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాకంతరావు. పురోహిత జేఏసీ అధ్యక్షుడు డివిఆర్ శర్మ, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ,ఆలయ పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య  తదితరులు పాల్గొన్నారు.