చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్.... 310 గ్రాముల బంగారం,70 గ్రాముల వెండి,పంచలోహ విగ్రహం,రూ 95 వేల నగదు స్వాధీనం..
ఇల్లందులో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ గుగులోత్ రంజిత్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 310 గ్రాముల బంగారం,70 గ్రాముల వెండి,పంచలోహ విగ్రహం,రూ 95 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినిత్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చేస్తున్న గుగులోత్ రంజిత్ ను ఈనెల 20న ఇల్లందు సిఐ బాణోత్ రాజు, సిబ్బంది నిఘా పెట్టి పట్టుకున్నారన్నారు.