కార్తీకమాస వనసమారాధనకు అధిక సంఖ్యలో తరలిరావాలి

Submitted by bathula radhakrishna on Fri, 04/11/2022 - 21:04
Yellandu

ఈనెల 13న మున్నూరు కాపు కులస్తుల కార్తీకమాస వనసమారాధనకు మున్నూరు కాపులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మున్నూరు కాపు పెద్దలు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.ఖమ్మం రోడ్డులోని యకూబ్ సెట్ దర్గాకు ఎదురుగా గల మామిడి తోటలో కార్తీకమాస వనసమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు.కార్తీకమాస వనసమారాధన విజయవంతానికి ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ,సహకారాలను అందించాలని కోరారు. సంఖ్యా పరంగా అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు కార్తీకమాస వనసమారాధన ద్వారా  మన ఐక్యతను చాటాలని  కోరారు.

Tags