పోడు భూముల సమస్య పై మార్గదర్శకాలు విడుదల:ఎమ్మెల్యే

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 18:21
Yellandu

ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పేర్కొన్నారు.గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.పోడు భూముల సమస్యను అధికారులు,ప్రజలు పరస్పరం సహకరించుకోని సమస్యను శాశ్వత పరిష్కారం చేసుకోవాలని సూచించారు.పోడు భూములకు సంబంధించి సర్వే కోసం ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.ప్రజలు తమ భూములను సర్వే  చేయించుకోవాలన్నారు.ఈ అవకాశాన్ని ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని పోడు భూముల సమస్య ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోని అధికారులకు సహకరించి పోడు భూముల సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

Tags