మహాశక్తి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ గా దిలీప్

Submitted by bathula radhakrishna on Mon, 17/10/2022 - 20:43
Yellandu

 

మహాశక్తి ఆర్గనైజేషన్ అనే  స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షునిగా మాలోత్ దిలీప్ కుమార్ ను ఎంపిక చేశారు.సింగరేణిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్ట పరిహారం,శాశ్వత ఉద్యోగాలు కల్పించడానికి 8 ఏళ్లు సింగరేణి యాజమాన్యంతో పోరాడి జీవో నెంబర్ 34,68 ల ప్రకారం సుమారు 400 గిరిజన నిర్వాసిత కుటుంబాలకు సింగరేణి సంస్థలో ఉద్యోగ అవకాశాలు, నష్టపరిహారాన్ని దిలీప్ ఇప్పించడం జరిగింది.ఇల్లందు-కోయగూడెంకు చెందిన సింగరేణి భూనిర్వాసిత కమిటీని స్థాపించి ఆ సంస్థ ప్రెసిడెంట్ గా మాలోత్ దిలీప్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ గా ఇర్ఫా నరేష్,జనరల్ సెక్రటరీగా సంతోష్ పాసి,ట్రెజరర్ గా మహేష్ కోరి,జాయింట్ సెక్రటరీగా బండి రమేష్ బాబు,ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కురుసం రమేష్,భూక్య సింధు ప్రియా లను ఎన్నుకున్నారు.ఈసందర్భంగా మాలోత్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మహాశక్తి ఆర్గనైజేషన్ ఇకపై సింగరేణి భూనిర్వాసితుల కోసం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పౌరుల హక్కుల కోసం పోరాటం చేయటం జరుగుతుందని స్పష్టం చేశారు.

Tags