ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి

Submitted by bathula radhakrishna on Fri, 14/10/2022 - 18:10
Yellandu

 

 

కొమరం భీమ్ వర్ధంతిని  శుక్రవారం బీఎస్పీ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ సెంటర్ లోని కొమరం భీమ్ విజ్ఞాన కేంద్రం నందు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బిఎస్పీ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ కొమరం భీమ్ ఆదివాసులందరిని కలుపుకొని నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు.జల్, జంగిల్,జమీన్ అనే నినాదంతో ప్రజలందరిని ఏకం చేసి నైజాం నిరంకుశ పాలనపై పోరాడిన గొప్ప యుద్ధ వీరుడని పేర్కొన్నారు. కొమరం భీమ్ ఆశయ సాధన కొరకు కృషి చేసి రాజ్యాధికారాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ విజ్ఞాన కేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు పూనెం కోటయ్య దొర,గౌరవ అధ్యక్షులు ధనసరి రామ్మూర్తి దొర,సభ్యులు ఈసం సీతారాములు,వాసం వెంకటరత్నం,ఇర్ఫ ఈశ్వరయ్య,వాసం రాములమ్మ,గుండం కళావతి,లేతాకుల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Tags